PM Kisan 21st Installment Date : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ విడత దీపావళికి ముందే వస్తుందా? రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?

PM Kisan Scheme

PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడత 2025 విడుదల కానుంది. ఇప్పటివరకూ 20 వాయిదాలు అందుకున్న రైతులు 21వ వాయిదా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

అందిన సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ 21వ విడత రూ. 2వేలు వచ్చే అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే.. దీపావళికి ముందుగానే నరేంద్ర మోదీ ఈ 21వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే, ఇప్పటివరకూ దీనిపై కేంద్ర ప్రభుత్వం (PM Kisan 21st Installment Date) కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. సాధారణంగా ఈ పీఎం కిసాన్ పథకం కింద వాయిదాలు దాదాపు ప్రతి 4 నెలల తర్వాత విడుదల అవుతాయి. ఈ ఏడాదిలో ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడత రైతుల ఖాతాలకు జమ అయింది. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు దాదాపు రూ. 20,500 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సాయాన్ని పొందారు.

Read Also : Amazon Festival Sale Offers : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!

పీఎం కిసాన్ అంటే ఏంటి? :
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అధికారికంగా పీఎం కిసాన్ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ఆదాయ మద్దతును అందించడమే ఈ పథకం ఉద్దేశం. భారత ప్రభుత్వం డిసెంబర్ 2019లో ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించింది. ఈ చొరవ కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి రూ. 6,000 అందుకుంటారు.

ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా ప్రతి 4 నెలలకు 3 సమాన వాయిదాలలో రూ. 2,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల అవుతుంది. ఈ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 120 మిలియన్ల మంది రైతులకు అందుబాటులో ఉంది. PIB డేటా ప్రకారం.. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ. 3.69 లక్షల కోట్లకుపైగా రైతుల ఖాతాలకు బదిలీ అయింది.

రైతులు 21వ వాయిదా కోసం ఇలా చేయండి :

  • 21వ విడత ఆలస్యం కాకుండా ఉండేందుకు రైతులు ఈ కింది వాటిని తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
  • ఫుల్ e-KYC : రైతులు తమ e-KYC పూర్తి చేశారో లేదో ధృవీకరించుకోవాలి.
  • ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ : పీఎం కిసాన్ పేమెంట్ల కోసం రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ అకౌంటుతో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి.
  • భూ రికార్డులు అప్‌డేట్ : రైతులు తమ భూమి రికార్డులు, వెరిఫైడ్ పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్ డేట్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి.
  • ఈ పనులన్ని పూర్తి చేయడం ద్వారా పీఎం కిసాన్ వాయిదా డబ్బులు నేరుగా బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి.

పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • రైతులు 21వ వాయిదా వస్తుందో లేదో ఇలా ఈజీగా ట్రాక్ చేయవచ్చు.
  • అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌ (https://pmkisan.gov.in/rpt_beneficiarystatus_pub.aspx) విజిట్ చేయండి.
  • సెర్చ్ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ వంటి కింది వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకోండి.
  • ఆధార్ కార్డులోని మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • బ్యాంక్ ఖాతా కలిగి ఉంటే లింక్ చేసిన అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మొబైల్ ఉంటే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • స్క్రీన్‌పై కనిపించే Captcha కోడ్‌ను ఎంటర్ చేయండి.
  • రైతుల వివరాలను ఎంటర్ చేశాక “Get Data” పై క్లిక్ చేయండి.
  • ఆపై Continue బటన్‌ను క్లిక్ చేయండి.

    పేజీలో లబ్ధిదారుడి వివరాలను ఇలా చెక్ చేయండి :
    రైతు పేరు, తండ్రి/భర్త పేరు రాష్ట్రం, జిల్లా, గ్రామం పేమెంట్ స్టేటస్, వాయిదా వివరాలు ఆధార్ ధృవీకరణ స్టేటస్ వంటివి చెక్ చేయాలి.

ఈ ప్రక్రియ ద్వారా రైతులు తమ పేమెంట్ స్టేటస్ త్వరగా ట్రాక్ చేయొచ్చు. ఏదైనా తప్పులు ఉంటే రైతులు స్థానిక అధికారులను సంప్రదించాలి. పీఎం కిసాన్ పోర్టల్‌లోని హెల్ప్‌లైన్ నంబర్‌ల ద్వారా సంప్రదించాలి.

​PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతుల కోసం 21వ వాయిదా అతి త్వరలో రాబోతుంది. దీపావళికి ముందుగానే వస్తుందా? రూ. 2వేలు పడాలంటే ఇలా చేయండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *