Headlines

ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్‌లు

: 175 పార్కుల అభివృద్ధి, పెట్టుబడులు,ఉపాధి అవకాశాలు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ అభివృద్ధి చేయాలని ఈ విధంగా మొత్తం 175 వీూవీజు పార్కులు ఏర్పాట్లవుతాయని ప్రతిపాదించింది.వీటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 122, ప్రైవేటు భాగస్వామ్యంలో 53 పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒక్కో పార్కును సుమారు 100 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. భూమి పెద్దగా అందుబాటులో ఉంటే పారిశ్రామిక పార్క్గా, తక్కువ భూమి ఉన్న చోట ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) గా రూపకల్పన చేయనున్నారు.
ఈ మొత్తం అభివృద్ధికి సుమారు రూ.1,750 కోట్లు అవసరమని అంచనా. అభివృద్ధి పూర్తి అయితే, సుమారు రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని, లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అధికారులు పేర్కొన్నారు.

అభివృద్ధి దశలు
ఈ MSME పార్కుల నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు:
మొదటి దశ – ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయనున్న 122 పార్కుల్లో 56 టార్గెట్ చేశారు. వీటిలో 17 పూర్తి, 39 శంకుస్థాపన చేశారు.రెండో దశ – 25 పార్కులను నిర్మాణానికి సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ దశలో వీటి కోసం భూములు సిద్ధం చేయబడ్డాయి.మూడో దశ – మిగతా 41 పార్కులు వీూవీజులకే కేటాయించి అభివృద్ధి చేయనున్నారు.చిన్న పరిశ్రమల నిర్వాహకులపై పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు, ప్రభుత్వం ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను అందించడానికి నిర్ణయించింది.

భూముల గుర్తింపు
ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న 119 పార్కుల భూములను సేకరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.ఇప్పటివరకు 102 పార్కుల భూములను గుర్తించారు. వీటిలో 66 భూములు పార్కులు/ఖీఖీజలకు అనువుగా ఉన్నవి, 36 భూములు అనువుగా లేవని తేలింది.ఈ 36 భూముల స్థానంలో ప్రత్యామ్నాయ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది.
ఇంకా 14 పార్కుల కోసం భూములను గుర్తించాల్సి ఉంది.

గుర్తించిన సమస్యలు
కొన్ని భూములు ఆక్రమణకు గురైనవి.
కొంతమంది భూములలో వాగులు, వంకలు ఉన్నాయి.
కొన్ని ప్రదేశాలలో భూములకు రోడ్డు మార్గం లేదు.
భిన్న శాఖల అనుమతులు పొందడంలో సమస్యలు ఏర్పడినవి.

The post ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్‌లు appeared first on Visalaandhra.

​: 175 పార్కుల అభివృద్ధి, పెట్టుబడులు,ఉపాధి అవకాశాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ అభివృద్ధి చేయాలని ఈ విధంగా మొత్తం 175 వీూవీజు పార్కులు ఏర్పాట్లవుతాయని ప్రతిపాదించింది.వీటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 122, ప్రైవేటు భాగస్వామ్యంలో 53 పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒక్కో పార్కును సుమారు 100 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. భూమి పెద్దగా అందుబాటులో ఉంటే పారిశ్రామిక పార్క్గా, తక్కువ భూమి ఉన్న చోట ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ
The post ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్‌లు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *