Headlines

Scuba Death: సింగర్ ప్రాణాలు తీసిన స్కూబా డైవింగ్..

Assam Singer Zubeen Garg Dies Scuba Diving Accident Singapore

Scuba Death: ప్రముఖ అస్సామీ సింగర్ (52) జుబీన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించారు. పలు నివేదికల ప్రకారం.. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు ఆయన్ను సముద్రం నుంచి రక్షించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

READ ALSO: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కపని చేస్తే చాలు.. అకౌంట్ లోకి డబ్బులు

“యా అలీ” పాటతో బాలీవుడ్‌లో దుమ్ములేపారు..
జుబీన్ గార్గ్ నవంబర్ 18, 1972న అస్సాంలోని జోర్హాట్‌లో జన్మించారు. ఆయన ఒక గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకుడు, నటుడు. ఆయన ప్రధానంగా అస్సామీ, హిందీ భాషలలో పాటలు పాడారు. అయితే ఆయన పాటలు బెంగాలీ, తమిళం, తెలుగు, నేపాలీ, మరాఠీలలో కూడా ప్రసిద్ధి చెందాయి. బాలీవుడ్ చిత్రం “గ్యాంగ్‌స్టర్” కోసం ఆయన పాడిన “యా అలీ” పాట చాలా ప్రజాదరణ పొందింది. ఆయన అస్సామీ, ఈశాన్య వర్గాలలో ఒక సాంస్కృతిక చిహ్నంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఆయన జాతీయ చలనచిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.

జుబీన్ గార్గ్‌ను రక్షించలేకపోయారు..
ప్రమాదంలో తీవ్రంగా గాయడిన ఆయనను పోలీసులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కానీ వైద్యులు జుబీన్ గార్గ్‌ను రక్షించలేకపోయారు. జుబీన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి సింగపూర్‌‌కు వెళ్లారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయన నేడు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆయన ఆకస్మిక మరణం అభిమానులను, మొత్తం అస్సామీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జుబీన్ గార్గ్ మరణం గురించి తెలిసిన తర్వాత అస్సాం, ఈశాన్య ప్రాంతాలు, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మాజీ రాజ్యసభ ఎంపీ రిపు బోరా ట్విట్టర్‌లో ఆయనకు నివాళులు తెలుపుతూ.. పోస్ట్ చేశారు. “మన సంస్కృతికి చిహ్నంగా నిలిచిన జుబీన్ గార్గ్ అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన స్వరం, సంగీతం, ధైర్యం అస్సాం తరాలకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన కుటుంబం, అభిమానులు, ప్రియమైన వారికి నా సంతాపం. శాంతిగా ఉండనివ్వండి, లెజెండ్” అంటూ పోస్ట్ చేశారు.

READ ALSO: India Map: భారత్ మ్యాప్‌లో ఆ దేశం ఎందుకు ఉంది.. కారణం తెలుసా?

​Scuba Death: ప్రముఖ అస్సామీ సింగర్ (52) జుబీన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించారు. పలు నివేదికల ప్రకారం.. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు ఆయన్ను సముద్రం నుంచి రక్షించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. READ ALSO: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కపని చేస్తే చాలు..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *