Headlines

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు..

29న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి.సెప్టెంబర్‌ 22 నుండి అక్టోబర్‌ 2 వరకు మొత్తం పదకొండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి, విదేశాల నుంచి కూడా కనీసం 18 లక్షల మంది భక్తులు హాజరుకావచ్చని అధికారులు అంచనా వేశారు.ఈ పదకొండు రోజులలో అమ్మవారు ప్రతి రోజు ఒక్కొక్కటి చొప్పున 11 విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

దసరా-2025 మొబైల్‌ యాప్
ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని దేవస్థానం ఈవో వి.కె. శీనానాయక్ తెలిపారు.ప్రత్యేకంగా దసరా-2025 మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.భక్తులు ఈ యాప్‌ ద్వారా సమాచారం పొందుతూ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.మూలా నక్షత్రం రోజైన సెప్టెంబర్‌ 29న, సోమవారం, దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు.ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటల నుండి 4.30 గంటల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించబడతాయి.

తొలి రోజు బాలా త్రిపురసుందరీ దేవి అవతారం
ఉత్సవాల తొలి రోజు అయిన సోమవారం అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తారు.ఆ రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనావకాశం కల్పిస్తారు.రెండో రోజు నుండి మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం పొందే అవకాశం ఉంటుంది.

The post నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు.. appeared first on Visalaandhra.

​29న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎంవిజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి.సెప్టెంబర్‌ 22 నుండి అక్టోబర్‌ 2 వరకు మొత్తం పదకొండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి, విదేశాల నుంచి కూడా కనీసం 18 లక్షల మంది భక్తులు హాజరుకావచ్చని అధికారులు అంచనా వేశారు.ఈ పదకొండు రోజులలో అమ్మవారు ప్రతి రోజు ఒక్కొక్కటి చొప్పున 11 విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.భక్తులకు ఎటువంటి
The post నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు.. appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *