Headlines

Chiranjeevi Fans: జాగ్రత్త.. మరోసారి నోరు జారితే.. బాలకృష్ణకు చిరంజీవి అభిమానుల వార్నింగ్

Chiranjeevi Fans: అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవి గురించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలయ్యపై చిరంజీవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని మేము దైవంగా భావిస్తామన్నారు. అలాంటి వ్యక్తి గురించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నామన్నారు. చిరంజీవిపై అసెంబ్లీలో…

Read More

గాజాలో ఆగని రక్తపాతం

ఇజ్రాయిల్‌ దాడుల్లో 58 మంది పాలస్తీనియన్లు మృతి గాజా: గాజాలో ఇజ్రాయిల్‌ దాడులకు తెగబడుతూనే ఉన్నది. ప్రపంచదేశాలన్నీ ముక్తకంఠంతో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ఆగడాలను ఆపాలని డిమాండ్‌ చేస్తున్నా.. వెనక్కి తగ్గటంలేదు. ట్రంప్‌ అండతోనే ఇజ్రాయిల్‌ రెచ్చిపోతోందని అరబ్బుదేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం 58 మందికి పైగా పాలస్తీయన్లు మరణించగా, భారీ సంఖ్యలో గాయపడ్డారు. 2023 అక్టోబర్‌ నుంచి గాజాపై ఇజ్రాయిల్‌ జరిపిన యుద్ధంలో కనీసం 65,549 మంది మరణించారు. 167,518 మంది గాయపడ్డారు. వేలాది…

Read More

త్వరలోనే గాజాపై ఒప్పందం: ట్రంప్‌

గాజా: యుద్ధాన్ని త్వరలోనే ముగించి, బందీలను తిరిగి వెనక్కి తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం త్వరలోనే పూర్తి కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని రైడర్‌ కప్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. అయితే, ఒప్పందం పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.”గాజాపై ఒప్పందం కుదిరేలా కనిపిస్తోంది. బందీలను తిరిగి తీసుకువచ్చే ఒప్పందం అది. ఇది యుద్ధాన్ని ముగించే ఒప్పందం అవుతుంది” అని డోనాల్డ్‌ ట్రంప్‌…

Read More

ఒక్కో మహిళ అకౌంట్లో రూ.10వేలు

ఎన్నికలకు ముందు తెరపైకి కొత్త స్కీమ్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ పాట్నా: ఇన్నాళ్లు మతరాజకీయాలతో నెట్టుకోచ్చిన బీజేపీ..ఇపుడు అలాంటి జిమ్మిక్కులు పనిచేయటంలేదు. తాజాగా బీహార్‌లోని ఎన్డీఏ భాగస్వామి నితీశ్‌ సర్కార్‌ మరోసారి గెలిపించటానికి ఎన్నికలకు ముందు తెరపైకి మరో పథకాన్ని తెరపైకి తెచ్చింది.బీహార్‌లో మహిళా సాధికారిత కోసం జేడీయూ, ఎన్డీఏ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కృషి చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు…

Read More

మునిగిన ఎంజీబీఎస్‌

పర్యవేక్షించిన సీఎం రేవంత్‌రెడ్డిజీహెచ్‌ఎంసీ,హైడ్రా అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రిప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీయాలని ఆదేశం హైదరాబాద్‌ : మూసీ వరద ప్రవాహం ఎంజీబీఎస్‌నూ ముంచెత్తింది. మోకాలిలోతులో నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఘటనాస్థలిపై ఆరాతీశారు. సత్వరమే చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులను పురమాయించారు. ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించాలని సూచించారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో వరదముంపు ప్రభావిత ప్రాంతాలపై సమీక్షించారు.చాదర్‌…

Read More

అక్టోబర్‌ 5,6 తేదీల్లో తెలంగాణ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వెన్షన్‌

సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో నిర్వహణపోస్టర్‌ ఆవిష్కరించిన సీఐటీయూ నేతలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వెన్షన్‌ అక్టోబర్‌ 5,6 తేదీల్లో కొమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ ఎస్వీ.రమ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కన్వెన్షన్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మహాసభకు రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మంది…

Read More

లగ్జరీ కార్ల డీలర్‌ బసరత్‌ ఖాన్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నగరంలో లగ్జరీ కార్ల విక్రయాల డీలర్‌ బసరత్‌ ఖాన్‌ ఇల్లు, కార్యాలయంతో పాటు అతని స్నేహితుల ఇండ్లలో ఈడీ సోదాలు ముగిశాయి. దాదాపు 6 గంటలకుపైగా అధికారులు సోదాలు నిర్వహించారు. ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్‌ ఖాన్‌ను ఇప్పటికే అహ్మదాబాద్‌ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన లగ్జరీ కార్లు అమ్మినట్టు ఈడీ గుర్తించింది. విదేశాల నుంచి తెచ్చిన కార్లకు పన్ను ఎగవేత ఆరోపణలతో ఈడీ సోదాలు చేపట్టింది. బసరత్‌ ఖాన్‌…

Read More

సెప్టెంబర్‌లో రైతులకు సరిపడా యూరియా అందించాం

రబీ కోసం ముందుగానే సరఫరా చేయండి : కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వినతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సెప్టెంబర్‌లో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందగా, ఒక్క సెప్టెంబర్‌లోనే 1.84 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా జరిగిందని…

Read More

‘సోషల్‌ మీడియా పోస్టు’ ఆధారంగా పోలీసుల తప్పుపై తప్పు

సీబీఐ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు ఆదేశంఅమరావతి : సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేసిన పిటిషన్‌లో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ సౌందరరెడ్డి అరెస్టు అక్రమమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పింది. గంజాయి కేసులో సౌందరరెడ్డిని పోలీసులు ఇరికించారని పేర్కొంది. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరో తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెంట్‌ లేకుండా అరెస్టు చేశారని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను అమలు…

Read More

ఏపీలో స్తంభించిన మండలి

చైర్మెన్‌కు అవమానం జరిగిందని వైసీపీ నిరసనపలుమార్లు సభ వాయిదా అమరావతి : శాసనమండలి చైర్మెన్‌ మోషేన్‌ రాజును ప్రభుత్వ ముఖ్యమైన కార్యక్రమాలకు పిలవకుండా అవమానపరుస్తున్నారంటూ శుక్రవారం మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రెండు రోజుల క్రితం కొత్త భవనం ప్రారంభోత్సవానికి మండలి చైర్మెన్‌ను ఆహ్వానించలేదని, శిలాఫలకం, ఆహ్వానపత్రంలో మోషేన్‌ రాజు పేరు లేదని మండలిలో ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మహిళా పార్లమెంటరీ సదస్సుకు…

Read More