పొరుగు దేశాలు కలిసివుండటం నేర్చుకోవాలి
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లండన్ : పొరుగు దేశాలు పరస్పర సహకారంతో కలిసివుండటం నేర్చుకోవాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. లండన్లో ఆదివారం ప్రవాస పాకిస్థానీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించకుండానే భారత్- పాక్ మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా విశ్వసిస్తున్నారంటే.. వారు భ్రమలో జీవిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. భారత్- పాక్ రెండూ పొరుగు దేశాలని, కలిసి ఉండటం నేర్చుకోవాలని తెలిపారు….
