Headlines

తొలిరోజు ‘సర్’ హోరు

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన రోజునే లోక్‌సభ సర్‌పై ప్ర తిపక్షాల ఆందోళన, గందరగోళం నడుమ, నిరసనల హోరు మధ్య వాయిదా పడింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని పావుగా వా డుకొంటోందని విపక్షాలు ఆరోపించాయి. ఇందు లో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్‌తో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు గండికొడుతున్నారని విమర్శించారు. సభలో ముందుగా సర్‌పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఈ దశలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ లోగానే…

Read More

‘హిల్ట్’ ఆపండి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘హిల్ట్’ పాలసీ పే రిట రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ‘తెర’ లేపినందున, వెంటనే ‘హిల్ట్’ను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్వర్యంలో పార్టీ నా యకులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. గతంలో హైదరాబాద్‌లో పరిశ్రమలకు కేటాయించిన విలువైన భూములను…

Read More

చల్లారిన పత్తి చిచ్చు

మన తెలంగాణ/హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల లో సిసిఐ విధించిన నిబంధనలతో ఏర్పడిన ప్రతిష్టంభనలు ఎట్టకేలకు తొలగాయిని రా ష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనల కారణంగా కొనుగోళ్లకు అనుమతులు లభించని జి న్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిసిఐతో జరిపిన చర్చలు ఫలించాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నోటిఫై చేసిన మొత్తం 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం…

Read More

జోక్యం చేసుకోలేం

వక్ఫ్‌ ఆస్తుల వివరాల నమోదుకు గడువు పొడిగింపుపై.. న్యూఢిల్లీ : వక్ఫ్‌ బై యూజర్‌తో సహా రిజిస్టర్డ్‌ వక్ఫ్‌ ఆస్తులను ఉమీద్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయడానికి గడువు పొడి గించాలని కోరుతున్న పలు పిటిషన్ల విషయంలో జోక్యం చేసుకోవ డానికి సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. జస్టిస్‌ దీపంకర్‌ దత్తా, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జి మాసిలతో కూడిన బెంచ్‌ ఈ విషయంలో సంబంధిత వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు పిటిషనర్లకు స్వేచ్ఛనిచ్చింది. డిసెంబరు 6 లోగా డాక్యుమెంట్లను తక్షణమే…

Read More

నెలకు రెండుసార్లు విచారిస్తాం

ఢిల్లీ వాయుకాలుష్యం కేసుపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : ఢిల్లీ, దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో వాయుకాలుష్య సమస్య కేసు శీతాకాలంలో మాత్రమే విచారణ చేయాల్సిన ‘ఆచారం’ కేసుకాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సమస్యకు స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడానికి నెలలో రెండుసార్లు విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే, పంట వ్యర్థాల దహనం సమస్య అనవసరంగా రాజకీయ సమస్య లేదా ఇగో సమస్యగా మారకూడదని తెలిపింది. ఢిల్లీవాయుకాలుష్యం కేసును సోమవారం ప్రధాన న్యాయమూరి సూర్యకాంత్‌, న్యాయ మూర్తి జోరు…

Read More

14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి

అల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకుడున్యూఢిల్లీ : ఉగ్రవాద సంబంధిత మనీ లాండరింగ్‌ కేసులో అల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జావేద్‌ అహ్మద్‌ సిద్దిఖీకి ఢిల్లీ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. నవంబర్‌ 19న 13రోజుల పాటు ఇడి కస్టడీకి సిద్దిఖీని తరలించిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయనను అదనపు సెషన్స్‌ జడ్జి శీతల్‌ చౌదరి ప్రధాన్‌ ఎదుట హాజరు పరచగా, డిసెంబర్‌ 15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు….

Read More

‘మెట్రో’ భద్రతా విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు

మహిళా ప్రయాణికుల భద్రత, సామాజిక సాధికారతే లక్ష్యంగా కీలక నిర్ణయంవిధులు చేపట్టిన 20 మంది ట్రాన్స్‌జెండర్స్‌ నవతెలంగాణ-సిటీబ్యూరోదేశంలోనే అత్యాధునిక రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ మెట్రో రైలు సామాజిక బాధ్యతలో మరో చారిత్రక ముందడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వ సమానత్వం, గౌరవం, సమాన అవకాశాల స్ఫూర్తితో, మెట్రో భద్రతా విభాగంలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను సిబ్బందిగా నియమించుకుంది. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న వీరు సోమవారం(డిసెంబర్‌ 1) నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో తమ…

Read More

హైదరాబాద్‌లో కోవాసెంట్‌ కొత్త సెంటర్‌

ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబునవతెలంగాణ – హైదరాబాద్‌కోవాసెంట్‌ టెక్నాల జీస్‌ హైదరాబాద్‌లోని ఆత్రియా, ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌లో తన కొత్త ఏఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. డల్లాస్‌, న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, లండన్‌, దుబాయిలో ఉన్న గ్లోబల్‌ కార్యాలయాలతో పాటు ఈ కొత్త సెంటర్‌ ఏజెంటిక్‌ ఏఐ స్వీకరణకు ప్రత్యేకంగా అంకితమైందని ఆ కంపెనీ పేర్కొంది. ఈ సెంటర్‌ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌ బాబు లాంచనంగా ప్రారంభించారు. దీనికి ఐటి సేవల…

Read More

మరింతగా వణికించే శీతాకాలం

ఉత్తర, మధ్య భారత రాష్ట్రాలపై అధిక ప్రభావంసాధారణం కంటే ఎక్కువ చలి తీవ్రత : ఐఎండీ హెచ్చరిక న్యూఢిల్లీ : ఈ శీతాకాలంలో దేశంలోని పలు ప్రాంతాలు మరింత చలితో వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘చలిగాలి రోజులు’ సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, తూర్పు యూపీ, ఉత్తర మధ్యప్రదేశ్‌, పడమటి మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఈ ప్రభావం ఎక్కువ ఉండనున్నదని…

Read More

జాతీయ క్రీడా పోటీల్లో నారాయణ విద్యార్థుల అపూర్వ ప్రతిభ

బంగారం, వెండి పతకాలు కైవసంనారాయణ గ్రూప్‌ డైరెక్టర్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సీబీఎస్‌ఈ జాతీయ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌, ఆరో ఫెడరేషన్‌ కుడో కప్‌, నేషనల్‌ చాంపియన్‌షిప్‌- 2025 క్రీడా పోటీల్లో నారాయణ విద్యార్థులు అపూర్వ ప్రతిభను చాటారు. విశిష్ట విజయాలతో నారాయణ స్కూల్స్‌ కీర్తిపతాకాన్ని దశదిశలా వ్యాప్తిచేశారు. నారాయణ స్కూల్‌లో కేవలం చదువులకు మాత్రమే పరిమితం కాకుండా, ఆసక్తి ఉన్న ఇతర క్రీడాంశాలతో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందనటానికి ఈ విజయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని నారాయణ గ్రూప్‌ డైరెక్టర్‌…

Read More