హెచ్ఏఎల్తో రక్షణశాఖ ఒప్పందం
న్యూఢిల్లీ : వాయుసేనలో కీలక సేవలందిం చిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనున్న రక్షణ శాఖ.. వీటి స్థానంలో తేజస్ జెట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందు స్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రక్షణశాఖ ఒప్పందం చేసుకొంది. ఇందుకోసం ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీఎస్ఎస్) గ్రీన్ సిగల్ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం పూర్తయ్యింది. మిగ్-21 యుద్ధవిమానాల స్థానంలో ఈ సింగిల్ ఇంజిన్ ఎంకే-1ఏ తేజస్ జెట్లను ప్రవేశ పెడుతున్నారు. తాజాగా సమీకరిస్తున్న 97 విమా నాల్లో.. 68 యుద్ధవిమానాలు, 29 ట్విన్ సీటర్స్ ఉండనున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది.
ఈ అత్యా ధునిక ఫైటర్ జెట్లలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థలతోపాటు కంట్రోల్ యాక్యుయేటర్లు ఉంటాయి. వీటిలో 64శాతానికి పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నాయని రక్షణశాఖ పేర్కొంది. 2027-28 నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతోపాటు ఆత్మనిర్భర భారత్, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొంది స్తుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు వచ్చే ఆరేండ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపాయి. అయితే, హెచ్ఏఎల్తో ఇది రెండో ఒప్పందం కాగా.. రూ.48వేల కోట్లతో 83 తేజస్ యుద్ధవిమానాల సమీకరణకు రక్షణ శాఖ 2021 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
The post రూ.62వేల కోట్లతో 97 తేజస్ ఫైటర్జెట్లు appeared first on Navatelangana.
హెచ్ఏఎల్తో రక్షణశాఖ ఒప్పందంన్యూఢిల్లీ : వాయుసేనలో కీలక సేవలందిం చిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనున్న రక్షణ శాఖ.. వీటి స్థానంలో తేజస్ జెట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందు స్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రక్షణశాఖ ఒప్పందం చేసుకొంది. ఇందుకోసం ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీఎస్ఎస్) గ్రీన్ సిగల్ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం
The post రూ.62వేల కోట్లతో 97 తేజస్ ఫైటర్జెట్లు appeared first on Navatelangana.
