నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
The post తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
The post తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత appeared first on Navatelangana.
