Headlines

మహా రుద్రయాగ కమిటీకి ఘన సన్మానం..

నవతెలంగాణ -పరకాల 
పరకాల కుంకుమేశ్వర ఆలయ మహారుద్ర యాగ కమిటీని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ శాలువాలతో ఘనంగా సన్మానించారు. పరకాల పట్టణంలో నవంబర్ 3 సోమవారం రోజున శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో కార్తీక మాస మహా రుద్రయాగ మహోత్సవం ఏర్పాటు చేయనున్నారు. ఈ మహా రుద్రయాగానికి సోదా రామకృష్ణను హనుమకొండలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మహా రుద్రయాగ కమిటీ సభ్యులు రామకృష్ణను మహా రుద్ర యాగంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కార్యాన్ని విజయవంత చేయాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. దాంతో రామకృష్ణ స్పందిస్తూ ఈ మహా రుద్ర యాగానికి నా వంతు సహకారాలు అందిస్తానని ఈ యాగానికి కావలసిన సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తానని, కమిటీ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహా రుద్ర యాగ కమిటీ సభ్యులు కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, ఎర్రం లక్ష్మణ్, పిట్ట వీరస్వామి, పంచగిరి శ్యామ్, గందె రవి, ఆలయ డైరెక్టర్ తోట రవి తదితరులు పాల్గొన్నారు.

The post మహా రుద్రయాగ కమిటీకి ఘన సన్మానం.. appeared first on Navatelangana.

​నవతెలంగాణ -పరకాల పరకాల కుంకుమేశ్వర ఆలయ మహారుద్ర యాగ కమిటీని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ శాలువాలతో ఘనంగా సన్మానించారు. పరకాల పట్టణంలో నవంబర్ 3 సోమవారం రోజున శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో కార్తీక మాస మహా రుద్రయాగ మహోత్సవం ఏర్పాటు చేయనున్నారు. ఈ మహా రుద్రయాగానికి సోదా రామకృష్ణను హనుమకొండలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మహా రుద్రయాగ కమిటీ సభ్యులు రామకృష్ణను మహా రుద్ర యాగంలో కుటుంబ సమేతంగా
The post మహా రుద్రయాగ కమిటీకి ఘన సన్మానం.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *