Headlines

మెట్రోరైల్‌.. ఓ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌

మెట్రో రైల్‌ ప్లానింగ్‌లో సామాన్యుడు ఎక్కడ..? : హెచ్‌సీఎఫ్‌ చర్చా గోష్టిలో ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్య నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషీరాబాద్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు.. ఒక రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు అనీ, మెట్రో రైల్‌ ప్లానింగ్‌లో సామాన్యుని ఊసే లేదనీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ”మెట్రో రైల్‌ నష్టాలకు కారణమెవరు..? భవిష్యత్‌ సవాళ్లు ఏమిటి..?” అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ ఆర్ట్‌…

Read More

భూటాన్‌ను ముంచెత్తిన వరదలు

సహాయక చర్యలకు రంగంలోకి దిగిన భారత సైన్యంనేపాల్‌లోనూ భారీ వర్షాలు థింపు : కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండ డంతో పొరుగుదేశం భూటాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల కారణంగా వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. దీంతో వారికి సహాయం అందించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. భూటాన్‌ అధికారులు, భారత సైనికులు సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భూటాన్‌ ప్రజలను సురక్షిత…

Read More

జెడ్పీటీసీ, ఎంపీటీసీలపై ఫోకస్‌ పెట్టాం

త్వరలో ఇన్‌చార్జులను నియమిస్తాం : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అధిక సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుపొందడంపై ఫోకస్‌ పెట్టామనీ, ప్రతి జెడ్పీటీసీ స్థానానికీ ముఖ్య నేతలను ఇన్‌చార్జులుగా పెట్టనున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిత్వంపై ఒపీనియన్స్‌ తీసుకున్న తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఇన్‌చార్జులతో హైదరాబాద్‌లో సమావేశం ఉంటుందని చెప్పారు. ఆదివారం…

Read More

కరూర్‌ తొక్కిసలాటలో ప్రచారరథం సీజ్‌

డ్రైవర్‌పై కేసు నమోదుచెన్నై: కరూర్‌ తొక్కిసలాట ఘటనకు ముందు టీవీకే చీఫ్‌ , నటుడు విజయ్ ప్రచారరథం ఇద్దరు యువకులను ఢీకొీట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రచారరథాన్ని సీజ్‌ చేశారు. ఆ వాహనం నడిపిన డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా…

Read More

శాంతి ప్రణాళికపై నేడు కైరోలో చర్చలు

ఈజిప్ట్‌ చేరుకుంటున్న ప్రతినిధి బృందాలు వాషింగ్టన్‌ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు హమాస్‌, ఇజ్రాయిల్‌, అమెరికా ప్రతినిధి బృందాలు ఈజిప్ట్‌ రాజధాని కైరోకు చేరుకుంటున్నాయి. ప్రతినిధి బృందాల మధ్య సోమవారం చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రణాళికలోని అన్ని నిబంధనలకు హమాస్‌ అంగీకరిస్తుందా, ఇజ్రాయిల్‌ భద్రతా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. గాజా నుంచి దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం జరగదని ఇజ్రాయిల్‌ స్పష్టం చేసింది. మరోవైపు గాజా…

Read More

బస్‌ చార్జీల పెంపుతో పేద, మధ్యతరగతి జేబులు గుల్ల : కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌హైదరాబాద్‌ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస ఛార్జీని ఒకే సారి రూ. 10 పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి జేబులు గుల్లయినట్టేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ఈ ఛార్జీల పెంపు పిడుగులాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్య ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం మోపితే, బడుగుజీవులు, దినసరి కూలీలు…

Read More

ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయ్యండి

మాజీ మంత్రి హరీశ్‌ రావుయూసఫ్‌గూడ డివిజన్‌లో కాంగ్రెస్‌ బాకీ కార్డుల పంపిణీ నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని యూసఫ్‌గూడ డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో కలిసి పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌ పార్టీ చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా, ప్రజలకు బాకీ పడ్డ కార్డులను…

Read More

యూఎస్‌లో జాతి విద్వేషం

సంప్రదాయవాదంతో ఉన్మాదంనల్లజాతీయులు, విదేశీయులపై దాడులుహత్యలకు దారి తీస్తున్న పరిస్థితులుభారతీయులూ బాధితులేట్రంప్‌ గద్దెనెక్కిన తర్వాత నుంచి తీవ్రం వాషింగ్టన్‌ : అమెరికాలో జాత్యహంకారం ఆందోళన కలిగిస్తున్నది. ఇది అక్కడి నల్లజాతీయులు, ఇతర ప్రజలు, విదేశీయులను గందరగోళ పరిస్థితిలోకి నెట్టేస్తున్నది. యూఎస్‌లో జాతి ద్వేషాన్ని నరనరాన నింపుకున్న మితవాద శక్తుల దాడులకు వీరు బలవుతున్నారు. మితవాద శక్తులు, నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలకు ప్రభావితులవుతున్న కొందరు ఇలాంటి దారుణమైన చర్యలకు దిగుతున్నారు. ఇందుకు అమెరికాలో ఉన్న గన్‌కల్చర్‌ కూడా తోడై అది…

Read More

Kojagiri Purnima: అక్టోబర్ 6.. కోజాగరి పూర్ణిమ.. ఈ పూజ చేస్తే మీ ఇంట్లో కనకవర్షం ఖాయం..!

Kojagiri Purnima: అక్టోబర్ 6.. కౌముది లక్ష్మీ వ్రతం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలో, తద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఆశ్వీజ మాసంలో రాత్రి పూట పౌర్ణమి తిథి ఉన్న రోజును కోజాగరి పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. ఈ కోజాగరి పూర్ణిమ రోజు కౌముది లక్ష్మీవ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అక్టోబర్ 6 సోమవారంతో కూడినటువంటి కౌముది లక్ష్మీవ్రతం. సోమవారంతో కూడి కోజాగరి…

Read More

బడుగుల ఆశాజ్యోతి వెంకటస్వామి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఆయన వారసత్వాన్నే కాంగ్రెస్‌ కొనసాగిస్తోంది : మంత్రులు జూపల్లి, వివేక్‌, పొన్నం, వాకిటిఘనంగా కాకా 96వ జయంతి వేడుకలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీమంత్రి గడ్డం వెంకటస్వామి బడుగుల ఆశాజ్యోతి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాకా 96వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ…

Read More