Headlines

పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాం: తిలక్ వర్మ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియాకప్ టోర్నమెంట్ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు ట్రోఫీని అందించిన స్టార్ ఆటగాడు తిలక్‌వర్మ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశాడు. అతను తన చిన్ననాటి కోచింగ్ సెంటర్ లింగంపల్లిలోని లేగల గ్రౌండ్‌ను సందర్శించాడు. అనంతరం అక్కడ విలేకరులతో ముచ్చటించిన తిలక్ వర్మ ఆసియాకప్ గురించి పలు విషయాలు వెల్లడించాడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నాడు. ఇలాంటి స్థితిలో ఆసియాకప్‌లో దాయాదిల మధ్య జరిగిన మ్యాచుల్లో ఘర్షణ వాతావరణం…

Read More

అమెరికాలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఫెడరల్ వర్కర్స్‌ను తొలగించేందుకు డిఫర్డ్ రిజిగ్నేషన్ ప్రోగ్రామ్(DRP)ని ట్రంప్ స్టార్ట్ చేశారు. నిన్నటితో ఎంప్లాయిస్‌కు విధించిన గడువు ముగిసింది. వెంటనే రాజీనామా చేయాలని ఇప్పటికే వారికి ఈమెయిల్స్ అందాయి. తప్పనిసరి పరిస్థితిలో దాదాపు లక్ష మంది రాజీనామా చేయనున్నారు. ట్రంప్ నిర్ణయంతో USకు ఏటా $28 బిలియన్లు ఆదా అవుతాయని అంచనా. The post అమెరికాలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు!…

Read More

అమెరికా మా చేతులు కట్టేసింది

న్యూఢిల్లీ: 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత అప్పటి యుపిఎ ప్రభుత్వం తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, అలాగే విదేశాంగ మం త్రిత్వ శాఖ వైఖరి కారణంగా పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోకూడదని నిర్ణయించుకుందని మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వెల్లడించారు. ‘ప్రతీకారం నా మనసులోకి వచ్చింది’ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంగీకరించారు. అయితే ప్రభుత్వం సైనిక చర్యకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందన్నారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడుల త ర్వాత కొద్ది రోజులకే కేంద్ర…

Read More

గాజాలో శాంతి దిశగా ఓ ముందడుగు

సరిగ్గా రెండేళ్ల క్రితం మొదలై, ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో రూపొందిన 20 సూత్రాల ప్రణాళిక.. గాజాలో శాంతి దిశగా పడిన ఓ ముందడుగుగా అభివర్ణించవచ్చు. ప్రణాళికలో పేర్కొన్న అంశాలను గమనిస్తే, కొంత కాలంగా దీని రూపకల్పన కోసం ట్రంప్ బృందం ఎంతగా కసరత్తు చేసిందో అర్థమవుతుంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు వచ్చిన దేశదేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్ వైఖరిని దునుమాడటం, గాజాలో జరుగుతున్న నరమేధం…

Read More

ఐఏఎస్‌ల ఇష్టారాజ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రులు వర్సెస్ ఐఏఎస్‌లుగా పలు శాఖల్లో వార్ నడుస్తోంది. మంత్రులు చెబితే తామెందుకు చేయాలని ఐ ఏఎస్‌లు వ్యవహారిస్తున్నట్టుగా సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐఏఎస్‌ల తీరుతో ప్రభుత్వంలో వారి పనితీరు వివాదాస్పదం అవుతోంది. శాఖల్లో మేమే సర్వం మేం చెప్పినట్లే జరగాలి అన్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు బ్యూరోక్రాట్స్ తీరు ఉం టోందన్న చర్చ జరుగుతోంది. వారు తీసుకునే నిర్ణయాలతో పాటు వ్య వహారిస్తున్న తీరు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి….

Read More