
Telangana :వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద యాదయ్య తన భార్య, కుమార్తె, వదిన (భార్య అక్క)ను కత్తితో గొంతుకోసం హత్య చేశాడు. ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీ ఘటన స్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్సీ శ్రీనివాస్ ఘటన స్థలిని పరిశీలించారు. ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నారు.
Telangana :వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.
