Headlines

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తుల రద్దీ

కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ రోజున శివ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంతో పాటు పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లులో భక్తుల సందడి నెలకొంది. అదేవిధంగా అమరావతి, ముక్త్యాల వంటి ఇతర ప్రసిద్ధ శైవ క్షేత్రాలు కూడా భక్తులతో నిండిపోయాయి. వేకువజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు కార్తిక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో, ాహర హర మహాదేవ శంభో శంకర్ణ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

The post శివాలయాలకు పోటెత్తిన భక్తులు appeared first on Visalaandhra.

​ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తుల రద్దీ కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ రోజున శివ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంతో పాటు పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లులో భక్తుల సందడి నెలకొంది. అదేవిధంగా
The post శివాలయాలకు పోటెత్తిన భక్తులు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *