పి హెచ్ సి లను సందర్శించిన జిల్లా బాస్
విశాలాంధ్ర – దేవరపల్లి /కొవ్వూరు : తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. వేంకటేశ్వర రావు శనివారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు దొమ్మేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), దేవరపల్లి PHCలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో జరుగుతున్న తుఫాను అనంతర వైద్య చర్యలు, నీటి నిల్వల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గృహ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. జ్వర పీడితులను గుర్తించి తక్షణ చికిత్స అందేలా చూడాలని, వైద్య…
