భారీగా పెరిగిన బంగారం ధరలు
నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.820 పెరిగి రూ.1,12,150 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10గ్రాం. బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,02,800కు చేరింది. అలాగే కేజీ వెండిపై రూ.2000 పెరిగి రూ.1,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. The post భారీగా పెరిగిన బంగారం ధరలు appeared first on…
