Headlines

PM Modi: ఇతర దేశాలపై ఆధారపడటమే… మనకు అతి పెద్ద శత్రువు

“ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువు ఎవరూ లేరని.. మనకు ఎవరైనా శత్రువు ఉంటే, అది ఇతర దేశాలపై ఆధారపడటమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. ఇది మన అతిపెద్ద శత్రువని… మనమంతా కలిసి ఈ శత్రువును ఓడించాలి.” అని అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోతో గుజరాత్ పర్యటనను ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గాంధీ మైదాన్‌కు చేరుకున్నారు, అక్కడ ఆయన ₹34,200…

Read More

H-1Bవీసాపై భారీగా పెరిగిన ఫీజు..ఉద్యోగుల‌కు అమెజాన్ కీల‌క ఆదేశాలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌’ విధానాల్లో భాగంగా.. హెచ్‌ 1 – బి వీసా దరఖాస్తులపై రుసుమును లక్ష బిలియన్‌ డాలర్లకు అమాంతం పెంచేశారు. దీంతో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు.. తమ ఉద్యోగుల్ని రేపటిలోగా (సెప్టెంబర్‌ 21) అమెరికాను వీడి వచ్చేయండి అని హెచ్చరికలు జారీ చేసినట్లు తాజాగా రాయిటర్స్ న్యూస్ వెల్లడించింది. అమెజాన్‌ హెచ్‌ 1- బి, హెచ్‌ -4 వీసాదారులు సెప్టెంబర్‌ 21లోగా అమెరికా నుంచి తిరిగి రావాలని తమ…

Read More

Air India Saree : ఎయిరిండియా చీర, ప్యాంట్ యూనిఫాం అంట.. పిచ్చ తిట్లు తిడుతున్న నెటిజన్లు

Air India Saree Pant Uniform : టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది కోసం తయారు చేసిన యూనిఫాంపై నెట్టింట్లో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది కోసం ‘చీర- ప్యాట్’ శైలిలో సరికొత్త యూనిఫాంను డిజైన్ చేశారు. ఆ డిజైన్ భారతీయ సంప్రదాయాలను కించపర్చేదిలా ఉందంటూ నెటిజన్లు ఫైర్…

Read More

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ‘‘మహిళల కోసం…

Read More

Story board: ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా?

Story board: ఎవరో ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ చెబుతుంటే.. ఆయనవన్నీ అభూత కల్పనలే అంటోంది ఈసీ. బీజేపీ కూడా వరుస ఓటముల ఫ్రస్ట్రేషన్‌తో అలా మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తోంది. కానీ ఓట్ల చోరీ అంశానికి ఓ హేతుబద్ధ ముగింపు ఇవ్వల్సిన పని లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. Read Also: IND vs PAK: పాక్తో మ్యాచ్కి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్‌పై స్పందించిన ఎన్నికల సంఘం, ఆయన ఆరోపణలు…

Read More

దీపిక పదుకొనె చుట్టూ అంత మంది ఉంటారా..? అందుకే సందీప్ వంగ రిజెక్ట్ చేశాడా..?

Deepika Padukone team: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ పని సాధిస్తున్నాయి. మరి అలాంటి సందర్భంలోనే చాలామంది హీరోలు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు దూసుకెళ్తుండడం వల్ల మన తెలుగు సినిమాలకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గిరాకీ అయితే ఏర్పడుతోంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాలకు భారీ క్రేజ్ అయితే దక్కుతోంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్…

Read More

CM Revanth Reddy: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు. Also Read:Shiva Re-Release :…

Read More

రెండో రోజు సిట్ క‌స్టిడిలో ఎంపీ మిథున్‌రెడ్డి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రెండో రోజు సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. శనివారం సాయంత్రం విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. ఇక మిథున్‌రెడ్డి తొలిరోజు విచారణ 4 గంటల్లోనే ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిథున్‌రెడ్డిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు తొలిరోజైన శుక్రవారం 50…

Read More

బంగారం, వెండి రేట్లు మరోసారి రికార్డు స్థాయికి..

బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు, దాంతో బంగారం డిమాండ్ పెరుగుతోంది.అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడంవల్ల బంగారం ధర పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 20) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,340కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,060కి చేరింది. నగరాల వారీగా బంగారం ధరలు…

Read More

టార్పెంట్ ఆయిల్ తాగి చిన్నారి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మదనపల్లెలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పని చేసేందుకు వెళుతూ తన కుమార్తె అలిజ(2)ను వెంట తీసుకెళ్లింది. తల్లి పనిలో నిమగ్నం కాగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీళ్లు అనుకుని టార్పెంట్ ఆయిల్ తాగింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కళ్ల ముందే బిడ్డ మరణించడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. The post టార్పెంట్ ఆయిల్ తాగి చిన్నారి మృతి…

Read More