Headlines

ప్రభుత్వ విధానాల ఫలితమే వ్యవసాయ సంక్షోభం

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు నవతెలంగాణ-వరంగల్‌మన దేశంలో మూడింట రెండొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు. తరగతులకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన…

Read More

మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ఏంటి ?

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే ఆహార మెనూ తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మెనూ ప్రకారం పెట్టే ఆహారం ఏమిటి, నూట్రిషన్‌ ఆహారం ఉందా, ఒక్కో విద్యార్థికి ఎంత డబ్బు కేటాయింపు, దీనిని పెంపుదల చేశారా వంటి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంది. చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. అఖిల్‌ శ్రీగురుతేజ వేసిన…

Read More

ఇందిరమ్మ ఇండ్ల కోసం లంచమడిగితే ఫోన్‌ చేయండి

24 గంటల్లో చర్యలు ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపులు చేసిన నలుగురు అధికారుల సస్పెన్షన్‌పాత బాకీ కింద జమ చేసే బ్యాంకులపై చర్యలు : రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఇందిరమ్మ ఇండ్ల కోసం లంచమడిగితే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18005995991కు కాల్‌ చేసి వివరాలను తెలియజేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో…

Read More

474 రాజకీయపార్టీలపై వేటు

కేంద్ర ఎన్నికల సంఘం చర్య ఆరేండ్లలో ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగని వైనం న్యూఢిల్లీ : చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు చేపడుతోంది. తాజాగా గుర్తింపు పొందని 474 రాజకీయ పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది. 2019 నుంచి ఆరేండ్లలో ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు వేసింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యలయాలు లేవని వెల్లడించింది….

Read More

పేపర్‌ కప్‌లూ ప్రమాదమే

ఇక గ్లాస్‌, స్టీల్‌ పాత్రలే వాడాలి పంచాయతీ స్థాయిలో ప్రజా చైతన్యానికి నడుం బిగించిన కేరళ సర్కార్‌ తిరువనంతపురం : ప్లాస్టిక్‌ ఫుడ్‌ కంటెయినర్ల కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న పేపర్‌ కప్‌ల వల్ల ఎదురవుతున్న ముప్పులను కేరళ అసెంబ్లీ గుర్తించింది. కంటికి కనిపించని రీతిలో మైక్రో ప్లాస్టిక్స్‌, విషపూరితమైన లోపలి పూత వల్ల ఈ పేపర్‌ కప్‌లు కూడా ప్రమాదకారిగానే తయారయ్యా యని అసెంబ్లీ శుక్రవారం ప్రముఖం గా పేర్కొంది. ప్రజల్లో దీనిపట్ల చైతన్యం తీసుకువచ్చేందుకు వీలుగా…

Read More

శనివారం రాశిఫలాలు (20-09-2025)

మేషం –  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా మేలు జరుగుతుంది. వృషభం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపలకు దూరంగా ఉండండి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి. మిథునం – బంధువులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు…

Read More

భారత రాజ్యాంగ పీఠిక చదివారా?

ప్రభుత్వానికి ప్రత్యేక మతం లేదుదసరా ఉత్సవాలపై పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీం బెంచ్‌ న్యూఢిల్లీ : జాతీయ ఐక్యతకు ప్రధానమైన ఆదర్శాలుగా లౌకికవాదం, ఆలోచనల్లో, విశ్వాసాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం మన రాజ్యాంగం పీఠికలో పొందుపరచబడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సుప్రీం కోర్టు పిటిషనర్‌కు సూచించింది. చాముండేశ్వరి ఆలయంలో చారిత్రక మైసూరు దసరా ఉత్సవాలను బుకర్‌ ప్రైజ్‌ విజేత, ముస్లిం అయిన బాను ముష్తాక్‌ ప్రారంభించాలని తాను కోరుకోవడం లేదంటూ బెంగళూరు నివాసి హెచ్‌.ఎస్‌.గౌరవ్‌ సుప్రీంను ఆశ్రయించారు….

Read More

పేరెంట్స్‌పై భారమే

పెన్నులు, పుస్తకాలు, స్కూలు బ్యాగులమీద 18 శాతం జీఎస్టీ 22 నుంచి అమలు ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే అరకొర ఆదాయాలతో తమ పిల్లల్ని చదివించటమే తల్లిదండ్రులకు భారమవుతుంటే.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందాన వారిపై జీఎస్టీ భారాలు పడనున్నాయి. అప్పోసప్పో చేసి వారు కుటుంబాలను నెట్టుకొస్తున్నా అవి నెలవారీ ఖర్చులకే సరిపోవటం లేదు. ఇలాంటి ధైన్య స్థితిలో సీబీఐసీ సవరించిన జీఎస్టీ మరింత భారంగా మారటం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. న్యూఢిల్లీ : పరోక్ష…

Read More

అమెరికాకు తగ్గిన భారత పర్యాటకులు

ఆగస్టులో 15 శాతం తక్కువటారిఫ్‌ ఆందోళనలు, రూపాయి భారం ఎఫెక్ట్‌ న్యూఢిల్లీ : అమెరికాకు వెళ్లే భారత పర్యాటకుల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్‌ ఆందోళనకు తోడు అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రి క్తతలు పర్యాటకులపై ప్రభావం చూపాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ అమాంతం పడిపో వడం అమెరికా పర్యాటకాన్ని భారం చేసింది. ఈ పరిణా మాల నేపథ్యంలో గడిచిన ఆగస్టులో అమెరికాకు భారత పర్యాటకుల సంఖ్య 15శాతం…

Read More

ఏదుల నుంచి డిండికి పాలమూరు నీళ్లు

న్యాయమైన పరిహారం లేకుండా భూములివ్వబోమంటున్న రైతులు పోతారెడ్డిపల్లి రిజర్వాయరులో 750 ఎకరాలు ముంపుపనులకు భూసేకరణ సమస్య నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధిపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి ద్వారా నల్లగొండకు సాగు నీటిని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టింది. వరదల సమయంలో నీటిని ఎత్తిపోసుకునే డిండి ప్రాజెక్టు వల్ల జిల్లా రైతాంగానికి ఏమాత్రం నష్టం లేదన్నది అధికారులు, పాలకపార్టీల నేతల అభిప్రాయం. అయితే న్యాయమైన…

Read More