Machilipatnam: మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందిపై కేసు నమోదు..
Machilipatnam: మచిలీపట్నం పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన “చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ” ర్యాలీకి అనుమతి నిరాకరించినప్పటికీ, ఆ పార్టీ్కి చెందిన నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులు, సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. కానీ, వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు….
